Asianet News TeluguAsianet News Telugu

వాలంటీర్లకు రూ.11కోట్లు... వైసీపీ శ్రేణుల్ని చూస్తే జాలేస్తోంది: మాజీమంత్రి సోమిరెడ్డి


తిరుపతి ఉప ఎన్నికల్లో వైసిపి వాలంటీర్ల ద్వారా డబ్బులు పంపకం చేపట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.


తిరుపతి ఉప ఎన్నికల్లో వైసిపి వాలంటీర్ల ద్వారా డబ్బులు పంపకం చేపట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.  సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీ శ్రేణుల పనైపోయింది.. వారిని చూస్తే జాలేస్తోందన్నారు. ఒక్కో వాలంటీర్ కు ఐదు వేలిచ్చారని... వారి చేతుల మీదుగా రాజకీయం చేయిస్తున్నారని అన్నారు. వాలంటీర్లే ఓట్లు వేయిస్తారు...వాళ్లే పెత్తనం చేస్తారు... మీరు చూస్తూ వుండండనే నిర్ణయానికి జగన్ వచ్చారని పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికే వాలంటీర్లకు రూ.11 కోట్ల వరకు అందాయని... వాటిని ఓటర్లను పంచడానికి వారు సిద్దమయ్యారని సోమిరెడ్డి ఆరోపించారు. 

 ప్రభుత్వ నిధుల నుంచి వాలంటీర్లకు గౌరవవేతనం ఇస్తూ వారితో రాజకీయం చేయించడం దుర్మార్గమన్నారు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి టీచర్లను, రెవెన్యూ అధికారులను కార్యకర్తలుగా వాడుకుంటామంటే వ్యవస్థలు ఏమైపోతాయి అని నిలదీశారు. ఎన్నికల సంఘం దీనిని తీవ్రంగా భావించి వెంటనే చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి సూచించారు.

Video Top Stories