Asianet News TeluguAsianet News Telugu

తూతూమంత్రంగా కాదు.. పక్కాగా పనిచేస్తున్నాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం  లక్ష్యంగా వైయస్  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.  గురువారం చిత్తూరు  అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తూతూ మంత్రంగా అమలు  చేయడం కాకుండా శాసనాలను, చట్టాలను చేసి అమలు పరుస్తున్నారన్నాడు.   ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలను అందించేందుకు  ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 13 వేల మందిని ఎంపిక చేశామని, ఈ నెల 15వ  తేదీన రైతు భరోసా పథకం కింద రైతులకు 8 వేల కోట్ల రూపాయలను  అందించనున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప  చిత్తూరు  ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబులతో పాటు  పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.