Asianet News TeluguAsianet News Telugu

అభంశుభం తెలియని పసివాడినీ... దోపిడీలో భాగస్వామ్యం చేసిన కిలాడీ అత్తాకోడళ్లు

కృష్ణా జిల్లా కంకిపాడులో పట్టపగలే ఇద్దరు మహిళా దొంగలు చోరీకి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 

కృష్ణా జిల్లా కంకిపాడులో పట్టపగలే ఇద్దరు మహిళా దొంగలు చోరీకి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రెండు నెలల క్రితమే వీరు జైలు నుంచి బైటికి వచ్చారు. రాగానే వెంటనే మళ్లీ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు మహిళలు అత్తాకోడళ్లు కావడం విచిత్రం.కంకిపాడు బస్టాండు సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ పచ్చిపాల కోటేశ్వరరావు.. తన ఇంటికి గడియ పెట్టి పనులపై బయటకు వెళ్లాడు. అది గమనించిన విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, ఆమె కోడలు సాత్వితలు గడియ తీసి ఇంటి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు సంచిలో వేసుకున్నారు. ఇంతలో బైటికి వెళ్లిన ఇంటి యజమాని కోటేశ్వరరావు తిరిగి రావడంతో వీరు పట్టుబడ్డారు. మరీ విచిత్రం ఏంటంటే రెండు నెల కిందటే సాత్విత డెలివరీ కాగా పసిగుడ్డును వెంటపెట్టుకుని దొంగతనానికి వెళ్లారు. ఆ శిశువు డైపర్ లో కూడా కొన్ని బంగారు ఆభరణాలు దాచడంతో అంతా ఆశ్చర్చపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.