Asianet News TeluguAsianet News Telugu

ఎస్సై వేదింపులు... పోలీస్ స్టేషన్ ముందే మహిళా సర్పంచ్ ఆందోళన

అక్రమ కేసులతో పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందే ఓ మహిళా సర్పంచ్ గ్రామస్తులతో కలిసి బైఠాయిచారు. 

అక్రమ కేసులతో పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందే ఓ మహిళా సర్పంచ్ గ్రామస్తులతో కలిసి బైఠాయిచారు. నూజివీడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన సర్పంచ్ సత్యవాణి, భర్త కిషోర్ తో పాటు గ్రామస్తులు రూరల్ ఎస్సై బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆందోళన కు దిగారు. స్థానిక ఎస్సై రంజిత్ కుమార్ తమపై అక్రమ కేసులు బనాయించి బలవంతంగా అధికార పార్టీలోకి మారాలంటూ బెదిరిస్తున్నాడంటూ సర్పంచ్ తెలిపారు. పోలీసుల కుట్రను భరించలేక స్టేషన్ ముందు కూర్చొని న్యాయంకోసం పోరాడుతున్నామని వెల్లడించారు. 

Video Top Stories