Asianet News TeluguAsianet News Telugu

మహిళా సంఘాల మౌన ర్యాలీ (వీడియో)

కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా మండల సమాఖ్య మహిళల ఆధ్వర్యంలో మౌన దీక్ష ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం వెంటనే చేపట్టాలని, మహిళలమీద అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టాలని కోరారు.  

కర్నూల్  జిల్లా డోన్ పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా మండల సమాఖ్య మహిళల ఆధ్వర్యంలో మౌన దీక్ష ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం వెంటనే చేపట్టాలని, మహిళలమీద అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టాలని కోరారు. 

ప్రతి గంటకు దేశంలో ఎక్కడో ఒక చోట అత్యాచారం, దాడి, హత్యలు, లైగింక వేధింపులు, జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా మండల సమాఖ్య సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సుగుణమ్మ పాల్గొన్నారు.