Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో కలిసి లాడ్జికి వచ్చిన మహిళ: అనుమానాస్పద స్థితిలో మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా బావులపాడు మండలం కె. సీతారాంపూరానికి చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. 

విజయవాడ: కృష్ణా జిల్లా బావులపాడు మండలం కె. సీతారాంపూరానికి చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెను ఆవుల కృష్ణవేణి (30)గా గుర్తించారు. రెండు రోజుల క్రితం ప్రియుడితో కలిసి హనుమాన్ జంక్షన్ లోని ఓ లాడ్జికి వచ్చింది. .లాడ్జి నుంచి ఇంటికి వెళ్లిన కృష్ణవేణి అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జిలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా వారి దర్యాప్తు సాగుతోంది.

Video Top Stories