Asianet News TeluguAsianet News Telugu

కట్నం కోసం భర్త వేధింపులు... అత్తారింటి ఎదుటే మహిళ ధర్నా

విజయవాడ: ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడే కట్నం కావాలంటూ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ రోడ్డెక్కింది. 

విజయవాడ: ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడే కట్నం కావాలంటూ వేధిస్తున్నాడంటూ ఓ మహిళ రోడ్డెక్కింది. తనకు న్యాయం చేయాలంటూ బిడ్డతో కలిసి అత్తవారింటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గంపలగూడెం మండలం కనుమూరు గ్రామానికి చెందిన మంద తిరుపతిరావు తెలంగాణకు చెందిన సింధుని 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2016లో సింధు మగబిడ్డకు జన్మనిచ్చింది.  కొన్ని సంవత్సరాలు వీరి కాపురం సాఫీగా సాగగా ఇటీవల తిరుపతిరావు ప్రవర్తనలో మార్పు వచ్చింది.  అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించడం ప్రారంభించాడు. తనను భర్త వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ సింధు అత్తవారింటి ముందు ధర్నా చేపట్టింది. ఈమెకు కుల సంఘ నాయకులు, మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి.