Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలంలో దారుణం.. టూ వీలర్ లో పట్టుబడ్డ మద్యం, మాంసం..

కర్నూలులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్సేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో మద్యం, మాంసం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. 

కర్నూలులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్సేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో మద్యం, మాంసం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో సోమవారం ఒక్కరోజు 25 కిలోల మాంసం, మద్యం బాటిళ్లు దొరికాయి. బండి డిక్కీలో బ్యాగుల్లో అడుగున పెట్టి సరఫరా చేస్తున్న మాంసం పోలీసులు పట్టుకున్నారు. అయితే వీరు స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులని అందుకే కేసులు నమోదు చేసి, ఫైన్ లు వేసి వదిలేస్తున్నారని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.