Asianet News TeluguAsianet News Telugu

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో.. వ్యతిరేక వాల్ పోస్టర్లు..

విశాఖ పాడేరు ఏజెన్సీలోని గ్రామాల్లో గతరాత్రి మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి.

విశాఖ పాడేరు ఏజెన్సీలోని గ్రామాల్లో గతరాత్రి మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. అయితే తెల్లారేసరికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సైతం ఈ పోస్టర్లు దర్శనమివ్వడంతో కలకలం రేగింది. ‘గిరిజన ద్రోహులు మావోయిస్టులు అశోక్, శ్రీను, శ్రీకాంత్ లు. గిరిజనులు అయివుండి మా 
గిరిజనులనే చంపుతారా మావోయిస్టులారా మీ పద్ధతిని మారకపోతే మా గిరిజనుల చేతుల్లో శిక్ష తప్పదు’ అని రాసి ఉంది. ఏజెన్సీ జి.మాడుగుల మండలం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కాగా వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Video Top Stories