Asianet News TeluguAsianet News Telugu

ఎల్జీ పాలిమర్స్ ముందు చిన్నారి మృతదేహంతో ధర్నా.. పరిస్థితి ఉద్రిక్తం

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్‌ లీకేజిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కంపెనీ వెంటనే మూసివేయాలంటూ పెద్ద ఎత్తున ఇవాళ జనం కంపెనీ వద్దకు చేరుకున్నారు. గ్యాస్ లీక్ ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ దుర్ఘటనలో గ్రీష్మ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు ఆమె తల్లి తండ్రులు కూడా గ్యాస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.