Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో విషవాయువు : ఏడుగురు మృతి.. బాదితులను పరామర్శించనున్న సీఎం జగన్...

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఎల్టీ పాలిమర్స్ కంపెనీ బాదితులను పరామర్షించనున్నారు.  

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఎల్టీ పాలిమర్స్ కంపెనీ బాదితులను పరామర్షించనున్నారు.  విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషవాయువు లీకేజ్ లో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్ఆర్ వెంకటాపురం, గ్రామాల్లో విష వాయువులు పీల్చి ఊపిరాడక పరుగులు తీసిన జనం రోడ్లపై బావులలో కాలువల్లో ఎక్కడపడితే అక్కడ పడిపోయారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. వందల సంఖ్యలో బాధితులు పెరుగుతున్నారు. మనుషులే కాకుండా వందల సంఖ్యలో పశువులు కూడా అస్వస్థతకు గురయ్యాయి.  

Video Top Stories