Asianet News TeluguAsianet News Telugu

మత్తు రహిత నగరంగా విజయవాడ... పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమం

విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో గంజాయి, వైట్నర్ తో పాటు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన యువకులకు నగర ఉత్తర మండలం ఏసీపి షేక్ షాను ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. 

విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో గంజాయి, వైట్నర్ తో పాటు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన యువకులకు నగర ఉత్తర మండలం ఏసీపి షేక్ షాను ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఎన్జీవో సంస్థకు అప్పగించారు.  విజయవాడ నగరం మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దడంలో బాగంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు ఏసిపి. యువకులను నేరాలకు దూరంగా ఉంచటానికి కౌన్సిలింగ్ అనంతరం వారిపై ప్రత్యేక  నిఘా ఏర్పాటు చేస్తామని ఏసిపి అజిత్ సింగ్ తెలిపారు.