Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సచివాలయాన్ని తాకిన నిరుద్యోగుల నిరసన సెగ

వైసిపి సర్కార్ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది.  

వైసిపి సర్కార్ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది.  జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిరుద్యోగులు,విద్యార్థులు, విద్యార్థి సంఘాలుకదం తొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నిరసనల సెగ తాజాగా ఏపీ సచివాలయాన్ని తాకింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ముట్టడి కార్యక్రమం జరిగింది. సచివాలయం వద్దకు చేరకుని లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఏబివిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.