Asianet News TeluguAsianet News Telugu

కరోనా కలకలం : మాచర్లలో రెండు అనుమానిత కేసులు..ఒకరు హైదరాబాద్ వాసి....

గుంటూరు జిల్లా, మాచర్ల మండలంలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. 

గుంటూరు జిల్లా, మాచర్ల మండలంలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. పాలెం గ్రామానికి చెందిన చిరుమామిళ్ల మహాలక్ష్మి 55, వెల్దుర్తికి చెందిన బోయ వెంకట రెడ్డి 25లకు కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానితులుగా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. మహాలక్ష్మి ఫిబ్రవరిలో జర్మనీ నుండి రాగా వెంకటరెడ్డి హైద్రాబాద్ లో సాఫ్టువేరు గా పని చేస్తూ ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. ప్రధమ చికిత్స అనంతరం వీరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించామని ఆసుపత్రి సూపర్ నెండెండ్  డి.వి. రంగారావు తెలిపారు. 

Video Top Stories