Asianet News TeluguAsianet News Telugu

సీఐతో ప్రాణహాని... ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నాడు: గిరిజనుడి సెల్ఫీ వీడియో కలకలం

పల్నాడు : న్యాయం చేయాల్సిన పోలీసే తనకు అన్యాయం చేస్తున్నాడంటూ ఓ గిరిజన దివ్యాంగుడు సెల్పీ వీడియో ద్వారా ఆవేదనను వ్యక్తం చేసాడు. 

పల్నాడు : న్యాయం చేయాల్సిన పోలీసే తనకు అన్యాయం చేస్తున్నాడంటూ ఓ గిరిజన దివ్యాంగుడు సెల్పీ వీడియో ద్వారా ఆవేదనను వ్యక్తం చేసాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రాములు నాయక్ తల్లి మంగా భాయి ఇటీవల హత్యకు గురయ్యింది. ఆమెను సొంత అన్నదమ్ములే చంపారంటూ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ కేసుపై కోర్టులో విచారణ సాగుతుండగానే స్థానిక సీఐ సురేంద్ర బాబు తనను రాజీకి రమ్మని ఒత్తిడి చేస్తున్నాడని రాములు ఆరోపించాడు. దీంతో సీఐపై కూడా హైకోర్టులో కేసు వేసానని... దీంతో మరింత కక్షగట్టాడని అన్నాడు. సీఐతో తనకు ప్రాణహాని వుందని... అందువల్లే అజ్ఞాతంలోకి వెళ్లానని రాములు నాయక్ ఆందోళన వ్యక్తం చేస్తాడు. అతడి సెల్పీ వీడియో పల్నాడు జిల్లాలో కలకలం రేపుతోంది.