Asianet News TeluguAsianet News Telugu

ట్రాక్టర్ బోల్తా : కూలీకోసం బయలుదేరితే..ప్రాణాలే పోయాయి...

నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది.

నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు  మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అనిగండ్లపాడు, వెల్దుర్తి పాడు గ్రామానికి చెందిన కూలీలు వ్యవసాయ పనులకోసం దేశినేనిపాలెం వెళ్ళుతుండగా,  జొన్నలగడ్డ హైస్కూలు వద్ద ఈ ప్రమాదం జరిగింది.