Asianet News TeluguAsianet News Telugu

వేగంగా వచ్చి... రైల్వే అండర్ బ్రిడ్జ్ ని ఢీ కొట్టి...టిప్పర్ బీభత్సం...

విశాఖ జిల్లా, అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర టిప్పర్ బీభత్సం సృష్టించింది.

విశాఖ జిల్లా, అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర టిప్పర్ బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం చోడవరం వైపు వెళ్తున్న లారీ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరున్న సేఫ్టీ గ్రిల్ ఢీ కొట్టింది. లారీ అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే లారీలో ఉన్న క్లీనర్ బయటికి దూకేశాడు. లారీ డ్రైవర్ మాత్రం సుమారుగా అరగంటసేపు లారీలోనే ఉండిపోయాడు. స్థానిక యువకులు అతి కష్టంతో డ్రైవర్ ను బయటకు తీసి ప్రాణాలతో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ఊడేరు కు చెందిన అప్పలనాయుడు గా గుర్తించారు. డ్రైవర్ ప్రైవేట్ ఆస్పత్రిలో, క్లీనర్ నానాజీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.