Asianet News TeluguAsianet News Telugu

రాజధాని భూ కుంభకోణం : రిటైర్డ్‌ తహసిల్దార్‌ సుధీర్‌బాబు అరెస్ట్..

రాజధాని భూ కుంభకోణంలో ఇద్దరు కీలక వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 

రాజధాని భూ కుంభకోణంలో ఇద్దరు కీలక వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేశ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తుళ్లూరు రిటైర్డ్‌ తహసిల్దార్‌ సుధీర్‌బాబును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు సుధీర్ బాబు టీడీపీ నేతలకు సహకరించినట్టుగా కూడా పోలీసుల అనుమానిస్తున్నారు. సుధీర్ బాబుని సిట్ అధికారులు విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అక్కడినుండి వైద్య పరీక్షలు చేసి కోర్టుకు తరలించారు.