Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో ఘోరం... రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లి మండలంలోని  గామాలపాడు గ్రామ శివారులో రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతులు గామాలపాడుకు చెందిన వెంకటరామయ్య, జానీ, బాషాగా పోలీసులు గుర్తించారు.