పోలవరం ప్రాజెక్టు నిధులు తేలేక పోవడం మంత్రుల అసమర్థత
చంద్రబాబు నాయుడు గారు గెలిచాక వెంటనే ప్రమాణ స్వీకారం చేయకుండా ముందు ఢిల్లీ వెళ్లి ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో కలపాలని గట్టిగా కేంద్రం ప్రభుత్వంను కోరడం జరిగింది.
చంద్రబాబు నాయుడు గారు గెలిచాక వెంటనే ప్రమాణ స్వీకారం చేయకుండా ముందు ఢిల్లీ వెళ్లి ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో కలపాలని గట్టిగా కేంద్రం ప్రభుత్వంను కోరడం జరిగింది. లేకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పడం జరిగింది. అప్పటికి ఢిల్లీలో ఎంపీల ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. అయినా అప్పటికప్పుడు వాటిని మన రాష్ట్రంలో కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆ రోజు వాటిని కలపకపోతే తర్వాత తెలంగాణ అంగీకరించేది కాదు.