తాడిపత్రిలో టెన్షన్... టిడిపి, వైసిపి కౌన్సిలర్లకు మధ్య ఇనుప కంచె
కౌన్సిల్ సమావేశ మందిరంలో ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అధికారుటు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. టిడిపి, వైసిపి సభ్యులకు కేటాయించిన సీట్లకు మద్యలో ఇనుపకంచెను ఏర్పాటు చేశారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. కౌన్సిల్ సమావేశ మందిరంలో ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అధికారుటు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. టిడిపి, వైసిపి సభ్యులకు కేటాయించిన సీట్లకు మద్యలో ఇనుపకంచెను ఏర్పాటు చేశారు.