Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ నేత కిషన్ రెడ్డి చొరవ.. గుజరాత్ లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులు ఇంటికి...

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ వల్ల గుజరాత్ లో చిక్కుకుపోయారు. 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ వల్ల గుజరాత్ లో చిక్కుకుపోయారు. రవాణా సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అభ్యర్థన మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి  గుజరాత్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి నిన్న అర్ధరాత్రి మత్స్య కారులను సొంత రాష్ట్రాలకు తరలించారు. వారికి మార్గ మధ్యలో 
ఆహార పానీయాలకు మార్గమధ్య రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేసేవిధంగా చర్యలు తీసుకున్నట్లు కిషన్ రెడ్డి  తెలిపారు.