Asianet News TeluguAsianet News Telugu

టిడిపికి ఎదురుదెబ్బ... వైసిపిలో చేరిన టిడిపి జడ్పిటిసి అభ్యర్థి

కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. 

కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నందివాడ మండల టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి దాసరి మేరీ విజయ కుమారి మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు మేరీ విజయ తెలిపారు. ఆమెతో పాటు పలువురు టీడీపీ నాయకులకు వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కొడాలి నాని.