Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఆఫీసులో కోలాహలం.. ఎందుకంటే...

రాజధాని బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై టీడీపీ శ్రేణులు, రాజధాని రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై టీడీపీ శ్రేణులు, రాజధాని రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని టీడీపీ ఆఫీసులో కోలాహలం నెలకొంది. చంద్రబాబు పార్టీ కార్యాలయానికి రాగానే ‘జై అమరావతి’ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా చంద్రబాబును రైతు కూలీలు, రైతులు గజమాలతో సత్కరించారు. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌కు పార్టీ నేతలు, రైతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి.