Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు ఏపీ చేరిన చంద్రబాబు.. తనిఖీలు లేకుండా అనుమతి (వీడియో)

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. ఎపి, తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ దాటి ఏపీలోకి ప్రవేశించారు.  మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబులాక్ డౌన్ అమల్లోకి రావడంతో అక్లడే ఉండిపోయారు. చంద్రబాబులాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ఈ రోజు విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన ఉండగా విమానాలు రద్దు కావడంతో రోడ్డు మార్గాన రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరారు. గరికపాడు చెక్‌ పోస్ట్ వద్ద  పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ వాహనాల వరకు మాత్రమే అనుమతించి, అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీలు చేశారు. చంద్రబాబుకు కోదాడలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు  ఘన స్వాగతం స్వాగతం పలికారు.