అవి మరణాలు కాదు ప్రభుత్వ హత్యలు... కేసు పెట్టాల్సిందే..: ఎమ్మెల్యే నిమ్మల డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ పక్రియను పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ పక్రియను పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆక్సిజన్, వ్యాక్సిన్ పై దృష్టి పెట్టవలసిన జగన్, కక్షలపై దృష్టి పెట్టడంతోనే కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ ను కూడా రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. ఆక్సిజన్ అందక మృతి చెందడమంటే వాటిని ప్రభుత్వ హత్యలుగానే కేసులు నమోదు చేయాలన్నారు. పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్, సహజీవనం వంటి జగన్ వైఖరే నేడు ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిందని నిమ్మల మండిపడ్డారు.