Asianet News TeluguAsianet News Telugu

కాకమ్మ కబుర్లు ఆపేయ్ కాకానీ... వ్యవసాయమంటే ఏంటో తెలుసా?: సోమిరెడ్డి సెటైర్లు

అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటరిచ్చారు.

First Published Dec 13, 2022, 12:28 PM IST | Last Updated Dec 13, 2022, 12:28 PM IST

అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటరిచ్చారు. ఎవరిపై అంటే వారిపై నోరు పారేసుకుంటున్న మంత్రికి అసలు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా? అని ప్రశ్నించారు. రైతుల భూములు ఎలా దోచుకోవాలో, రైతుల వద్ద ఎకరాల లెక్కన పుట్లకు పుట్ల ధాన్యం దోచుకుని ప్యాలెస్ లు కట్టుకోవడమే కాకానికి తెలుసు... ఆయన వ్యవసాయ మంత్రిగా అనర్హుడు అని సోమిరెడ్డి అన్నారు. వైసిపి ప్రభుత్వంలో కరువు మండలాలు, రైతుల ఆత్మహత్యలే లేవంటూ మంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం వైసిపి పాలనలో ఏపీలో వందకుపైగా కరువు మండలాలు వున్నాయని లెక్కలు వెల్లడించారు. సీఎం జగన్ తో పాటు ఆయన తండ్రి వైఎస్సార్ హయాంలో, చంద్రబాబు హయాంలో రైతుల ఆత్మహత్యలను పోలుస్తూ ప్రస్తుతం రైతుల ఆత్మహత్యల్లో ఏపీ  రెండు మూడు స్ధానాల్లో వుందని మాజీ మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు.