Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఇంటి పక్కనే వలసకార్మికులపై లాఠీఛార్జి దారుణం.. చినరాజప్ప..

తాడేపల్లిలో వలసకార్మికులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని టీడీపీ మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రిలో ఖండించారు.

తాడేపల్లిలో వలసకార్మికులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని టీడీపీ మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రిలో ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ నివాసానికి దగ్గర్లోనే ఈ సంఘటన జరగడం అమానుషం అని మండిపడ్డారు. వందల కిలోమీటర్లు నడిచివెళ్ళే వలస కూలీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని, వెంటనే వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపే చర్యలపై దృష్టి పెట్టాలని, వారికి భోజన,వసతి ఏర్పాట్లు ఎక్కడికక్కడే చేయాలని ఆయన డిమాండ్ చేశారు.