Asianet News TeluguAsianet News Telugu

దోమలపై దండయాత్ర అంటే నవ్వారు.. ఐదేళ్ల తర్వాత ఏపీలో మలేరియా, డెంగ్యూ.. అయ్యన్నపాత్రుడు

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏపీలో మలేరియా, డెంగ్యూ విస్తరిస్తున్నాయని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏపీలో మలేరియా, డెంగ్యూ విస్తరిస్తున్నాయని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.  టీడీపీ హయాంలో దోమలపై దండయాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తే .... చంద్రబాబుపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హేళనగా మాట్లాడారన్నారు.  ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆనాడు చంద్రబాబు ఆలోచించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు, అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలు, ప్రజల సహకారం కారణంగానే మలేరియాను కంట్రోల్ చేయగలిగాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మలేరియా విజృంభిస్తోంది. వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు.  విశాఖ ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తోంది. రెండు నెలల ముందే మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకాదా?  దోపిడీ కార్యక్రమాలను పక్కనపెట్టి మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ డిపార్టెమెంట్ అధికారులు పర్యటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.