టీడీపీ నేత ఆత్మహత్యా యత్నం..కారణమిదే...
పోలీసుల వేధింపులు తట్టుకోలేక టీడీపీ నేత అవినాష్ ఆత్మహత్యాయత్నం చేశాడు.
పోలీసుల వేధింపులు తట్టుకోలేక టీడీపీ నేత అవినాష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ ధనలక్ష్మి కొడుకు అవినాష్. ఎస్ఎంపురంలోని శివాలయం విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య గొడవలతో నాలుగు నెలలుగా ఆలయం ప్రారంభోత్సవం ఆగిపోయింది. ఈ విషయమై విచారణ కోసం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అవినాష్ పోలీస్ స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.