Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి : చంద్రబాబు కుటిల రాజకీయమే కారణం...

శాసన మండలి రద్దుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే కారణమని మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రెహమాన్ ఆరోపించారు. 

శాసన మండలి రద్దుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే కారణమని మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రెహమాన్ ఆరోపించారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలి చైర్మన్ షరీఫ్ మృదు భాషి సాత్వికులు అని అటువంటి ఆయనకు ఇష్టం లేని విషయం పై ఒత్తిడి తీసుకువచ్చిన కుటిల రాజకీయ నేత చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. టిడిపి నేతలకు దమ్ము ధైర్యం ఉంటే విశాఖ రాజధాని వద్దంటూ ఉత్తరాంధ్రలో సభ ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే టిడిపి వ్యతిరేకించడం ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి రానున్న స్థానిక, జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.