Asianet News TeluguAsianet News Telugu

చట్టప్రకారం నడుచుకోండి.. డీజీపీపై చంద్రబాబు ఫైర్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు పోలీసులు అనుమతిస్తున్నారని.. కానీ రైతుల నిరసనలను మాత్రం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దుర్గమ్మకు మొక్కు తీర్చుకోవడానికి పొంగళ్లు తీసుకెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేయడం ప్రజా హక్కులను కాలరాయడం కాదా.? అని చంద్రబాబు ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను బూటు కాళ్లతో తన్నడం, లాఠీలతో బాదడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా.? అని ఆయన నిలదీశారు. ఇకనైనా చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డీజీపీ వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 

Video Top Stories