Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ నుండి గన్నవరంకు చంద్రబాబు... నెల్లూరుకు పయనం

విజయవాడ: కొడుకును కోల్పోయి బాధలో వున్న టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబు, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ(బుధవారం) నెల్లూరులో ప్రయాణించనున్నారు. 

విజయవాడ: కొడుకును కోల్పోయి బాధలో వున్న టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబు, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ(బుధవారం) నెల్లూరులో ప్రయాణించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నచంద్రబాబు భారీ కాన్వాయ్ తో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు బయలుదేరారు.  నెల్లూరులో మాగంటి రాంజీ చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి వెళ్లనున్నారు. ఇటీవల చింతలపూడి ఇంచార్జి కర్రా రాజారావు మృతి చెందగా అతడి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అక్కడి నుండి అమరావతి నివాసానికి చేరుకోనున్నారు. 
 

Video Top Stories