Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళంలో విషాదం... ఎగ్జామినేషన్ సెంటర్లోనే కుప్పకూలి ఇంటర్ విద్యార్థి మృతి

 శ్రీకాకుళం జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. పాతపట్నం మండలకేంద్రంలోని కిరణ్మయి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్న విద్యార్థి ఒక్కసారిగా తీవ్ర అస్వస్ధతకు గురయి ప్రాణాలు వదిలాడు. 

 

 శ్రీకాకుళం జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. పాతపట్నం మండలకేంద్రంలోని కిరణ్మయి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్న విద్యార్థి ఒక్కసారిగా తీవ్ర అస్వస్ధతకు గురయి ప్రాణాలు వదిలాడు. సారవకోట మండలం దాసుపురం గ్రామానికి చెందిన బోరాడ కార్తీక్ (16) పాతపట్నంలోని మహేంద్ర జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో కెమిస్ట్రీ పరీక్ష రాయడానికి ఎగ్జామినేషన్ సెంటర్ కు వెళ్ళాడు. అతడు కెమిస్ట్రీ పరిక్ష రాస్తూ ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ తలనొప్పితో స్పృహ కోల్పోయాడు. వెంటనే సిబ్బంది దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే కార్తిక్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు కుమారి,శ్యాంసుందర్ కన్నీటిపర్యంతం కావడం చూసేవారికి కన్నీరు తెప్పించింది.