Asianet News TeluguAsianet News Telugu

పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్... సీఎం జగన్ కీలక భేటీ

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఏపీలోని ప్రముఖ నగరం విశాఖపట్నంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల, సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఈ స్కూల్ ఏర్పాటుచేయనున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో నిర్మించనున్న స్కూల్ కు వచ్చేనెలలో శంకుస్థాపన చేయనున్నట్లు... ఆ కార్యక్రమానికి హాజరుకావాలంటూ సీఎం జగన్  ను కోరారు శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ను కలిసి ఆహ్వానించారు ట్రస్టీ మెంబర్‌ సుఖ్‌వల్లభ్‌ స్వామి, ధర్మ్‌సాగర్‌ స్వామి. వీరు మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కలిసివెళ్లారు. 

Video Top Stories