Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్...

కర్నూలు ఎంపీ, వైసీపీ నేత సంజీవ్ కుమార్ కుటుంబసభ్యులు ఆరుగురు కరోనా బారిన పడ్డారు. 

కర్నూలు ఎంపీ, వైసీపీ నేత సంజీవ్ కుమార్ కుటుంబసభ్యులు ఆరుగురు కరోనా బారిన పడ్డారు. వారందరూ ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఉన్నారని సంజీవ్ కుమార్ అన్నారు. అయితే లాక్ డౌన్ తో కరోనాను పూర్తిగా అరికట్టలేమని కూడా ఆయన తెలిపారు. కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, మన భారతీయుల శరీరాలు చాలా ఇమ్యూనిటీ ఉంటుందని కరోనాను ఈజీగా ఎదుర్కోగలమని తెలిపారు.