Asianet News TeluguAsianet News Telugu

22 విద్యార్థులతో ప్రయాణిస్తూ... మైలవరంలో స్కూల్ బస్సు బోల్తా

మైలవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన విద్యార్థులను తీసుకువెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది.

మైలవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన విద్యార్థులను తీసుకువెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. మంగళవారం ఉదయం స్కూల్ బస్సు జి.కొండూరు రూటులోని వెల్లటూరు-కుంటముక్కల గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కుంచుకొని తిరిగి వస్తుండగా కుంటముక్కల సమీపంలోని ఇటుకల బట్టీల వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 22 మంది విద్యార్థులు ఉండగా  ఒక విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్'తో సహా మిగిలిన విద్యార్థులంతా ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను ఆటోలో స్కూలుకు తరలించారు.