Asianet News TeluguAsianet News Telugu

గుంజపడుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగతనం

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్ బి ఐ బ్యాంక్ లో అర్థరాత్రి దొంగతనం జరిగింది. 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్ బి ఐ బ్యాంక్ లో అర్థరాత్రి దొంగతనం జరిగింది. బ్యాంక్ కిటికీ తొలగించి లోపటికి దూరిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. సిసి కెమెరా హార్డ్ డిస్క్ ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఉదయం దొంగతనం జరిగినట్లు గుర్తించిన బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి పెద్దపల్లి డిసిపి రవీందర్, గోదావరిఖని ఏసీపి ఉమేందర్, మంథని పోలీసులు చేరుకున్నారు.  డాగ్ స్క్వాడ్ బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ బ్యాక్ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.