Asianet News TeluguAsianet News Telugu

పండగపూట ప్రైవేటు బస్సుల దందా : ఆర్టీఏ దాడుల్లో బస్సుల సీజ్

కృష్ణాజిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు దాడులు జరిపారు. 

కృష్ణాజిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు దాడులు జరిపారు. ఈ దాడులలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 17 బస్సులను  సీజ్ చేశారు. గరికపాడు చెక్పోస్ట్, కీసర టోల్ ప్లాజా, కనకదుర్గ వారధి, పొట్టిపాడు టోల్ ప్లాజాల వద్ద ఈ దాడులు జరిగాయి. నిబంధనల ప్రకారమే బస్సులు నడపాలని అప్పటివరకు తనిఖీలు కొనసాగిస్తామని డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.