Asianet News TeluguAsianet News Telugu

టోల్ తప్పించుకోబోయి.. ప్రాణాలు హరీ మనిపించాడు...

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటో ఢీ కొన్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బ్రహ్మణతర్లకు చెందిన ఆళ్ల రవి, ధర్మాన జీవితేశ్వర్రావు పలాసలో చేపలు కొనుక్కుని  స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆళ్ల రవి, ధర్మాన జీవితేశ్వర్రావు అక్కడికక్కడే చనిపోయారు. కొత్త జాతీయరహదారి పై టోల్ ప్లాజా ఉన్నందున టోల్ రుసుమును తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో కాశిబుగ్గ పట్టణం మీదుగా లారీ వెళ్లడమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు అంటున్నారు. కాశిబుగ్గ పోలీసులు మృతదేహాలను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.