కూలీల ఆటోలను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది.
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా పోలీసులు గుర్తించారు.