Asianet News TeluguAsianet News Telugu

ఓ ప్రమాదంనుండి బయటపడ్డ వెంటనే మరో ప్రమాదం... లారీ డ్రైవర్ మృతి

కృష్ణా జిల్లా నందిగామలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రమాదం నుండి బయపడి తేరుకోకముందే మరో ప్రమాదానికి గురయి ఓ లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.

కృష్ణా జిల్లా నందిగామలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రమాదం నుండి బయపడి తేరుకోకముందే మరో ప్రమాదానికి గురయి ఓ లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.  

నందిగామ పాత కాకతీయ రెస్టారెంట్ వద్ద జాతీయ రహదారి పై లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన డ్రైవర్, క్లీనర్ లారీ నుండి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన పరిస్థితిని లారీ డ్రైవర్ ప్రక్కకు నిలబడి చూస్తుండగా మరో డీసీఎం కంటైనర్ వ్యాను వేగంగా దూసుకువచ్చి బోల్తాపడిన లారీని ఢీ కొట్టింది. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు వాహనాల మధ్య లో చిక్కుకున్న లారీ డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.