Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... మూడు లారీలు, ఆర్టీసి బస్సు ఢీ

కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురం బైపాస్ లో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురం బైపాస్ లో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక కారణంతో హైవే పక్కన నిలిపినన లారీని మరో లారీ డ్రైవర్ గమనించకపోవడంతో వేగంగా వచ్చి వెనకవైపు నుండి ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ వెనకాల వున్న తెలంగాణ ఆర్టీసి బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు వెనకాల వున్న లారీని అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూశారు. ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులను ఆరా తీశారు.