Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసిన పబ్జీ గేమ్

నూజివీడు.: విద్యార్థుల మధ్య పబ్జి ఆట విషయమై చెలరేగిన వివాదం చివరికి రెండు వర్గాల మధ్య దాడిగా పరిణమించింది. 

నూజివీడు.: విద్యార్థుల మధ్య పబ్జి ఆట విషయమై చెలరేగిన వివాదం చివరికి రెండు వర్గాల మధ్య దాడిగా పరిణమించింది. నూజివీడు మండలం కొత్తూరు తండా, సిద్ధార్థ నగర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు నూజివీడు కళాశాలలో చదువుతున్నారు. ఇళ్లకు తిరుగు ప్రయాణమైన సందర్భంలో బస్సు లోనే రెండు ఊళ్ళ కు చెందిన విద్యార్థుల మధ్య సరదాగా ప్రారంభమైన పబ్జి ఆట ఇరువర్గాలు దాడికి దారితీసింది. ఇరు గ్రామాల పెద్దలు సైతం జోక్యం చేసుకొని రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నూజివీడు రూరల్ ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.