Asianet News TeluguAsianet News Telugu

రిజర్వేషన్లపై సుప్రీం కోర్ట్ తీర్పు... రాజ్యాంగ పరిరక్షణ వేదిక నిరసన

రిజర్వేషన్ల పై సుప్రీం కోర్ట్ తీర్పును రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

విశాఖ పట్టణం: రిజర్వేషన్ల పై సుప్రీం కోర్ట్ తీర్పును రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ వేదిక విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ... రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తుందని,త్రిసభ్య దర్మాసనం ఇచ్చిన తీర్పు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధం దీనిపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి ,రిజర్వేషన్లని 9వ షెడ్యూల్ లోకి తేవాలని డిమాండ్ చేసారు .అలాగే రాజ్యాంగ విరుద్ధమైన  సీఏఏ,ఎన్ఆర్సీ,ఎన్‌పిఆర్ బిల్లును రద్దు చేయాలి అన్నారు.లేని పక్షంలో తమ పోరాటం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిక చేసారు.

Video Top Stories