Asianet News TeluguAsianet News Telugu

నర్సీపట్నంలో విషాదం... ఆడబిడ్డకు జన్మనిచ్చి బాలింత మృతి

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గురువారం ఉదయం బాలింత మృతి చెందడంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు.

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గురువారం ఉదయం బాలింత మృతి చెందడంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.  మెటర్నేటి వార్డు ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు వెంటనే డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

గొలుగొండ గ్రామానికి చెందిన గర్భిణీ ఎస్. సంతోషి కుమారిని ప్రసవంకోసం బంధువులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఏరియా ఆసుపత్రి డాక్టర్ గౌతమి బుధవారం మహిళకు పెద్ద ఆపరేషన్ చేయడంతో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పాపకు జన్మనిచ్చిన తర్వాత బాలింత మరణించింది. దీంతో చికిత్స సరిగ్గా అందకపోవడంతో ఆమె మృతిచెందిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. 
బాలింత మృతికి డాక్టర్ గౌతమే కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు వారు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.