Asianet News TeluguAsianet News Telugu

నాన్నా చచ్చిపోతున్నాను...అంటూ ప్రాణాలొదిలింది...

వైద్యుల నిర్లక్షానికి గర్భిణీ చనిపోయింది.

వైద్యుల నిర్లక్షానికి గర్భిణీ చనిపోయింది. రాంబిల్లి మండలం కొప్పుగుండి పాలెం గ్రామానికి చెందిన పాతాళ వరలక్ష్మి ఎన్టీఆర్ హాస్పిటల్ లో ప్రసవించింది. ఆమెకు పెద్దాపరేషన్ చేశారు. ఆ తరువాత హెవీ బ్లీడింగ్ కావడంతో ప్రాణాలు పోయాయి. అయితే ఆమెను డాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే చనిపోయిందంటూ బంధువుల ఆందోళనకు దిగారు. టౌన్ సీఐ. భాస్కర్ రావు ఆందోళనకారులతో  చర్చలు జరిపి విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.