నాన్నా చచ్చిపోతున్నాను...అంటూ ప్రాణాలొదిలింది...
వైద్యుల నిర్లక్షానికి గర్భిణీ చనిపోయింది.
వైద్యుల నిర్లక్షానికి గర్భిణీ చనిపోయింది. రాంబిల్లి మండలం కొప్పుగుండి పాలెం గ్రామానికి చెందిన పాతాళ వరలక్ష్మి ఎన్టీఆర్ హాస్పిటల్ లో ప్రసవించింది. ఆమెకు పెద్దాపరేషన్ చేశారు. ఆ తరువాత హెవీ బ్లీడింగ్ కావడంతో ప్రాణాలు పోయాయి. అయితే ఆమెను డాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే చనిపోయిందంటూ బంధువుల ఆందోళనకు దిగారు. టౌన్ సీఐ. భాస్కర్ రావు ఆందోళనకారులతో చర్చలు జరిపి విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.