Asianet News TeluguAsianet News Telugu

యువకుడి మృతదేహాన్ని సగం పూడ్చిపెట్టాక... అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని తీవ్ర మనస్థాపానికి గురయిన నర్సింగ్ రావు(18) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని పూడ్చిపెడుతుండగా విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చట్టప్రకారం పోస్టుమార్టం నిర్వహించాలంటూ మృతదేహాన్ని తరలించడానికి పోలీసులు యత్నించగా కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మృతదేహాన్ని తరలించడానికి వీల్లేదంటూ కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో మునుకుళ్ల గ్రామ స్మశానవాటిక వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.