Asianet News TeluguAsianet News Telugu

దారుణం : అంబులెన్స్ కు దారివ్వని పోలీసులు.. తీవ్ర రక్తస్రావంతో నిండు గర్భిణీ మృతి

కర్నూలులో లాక్డౌన్ నిబంధనలు ఓ గర్భిణీ ప్రాణాన్ని నిలువునా తీశాయి.

కర్నూలులో లాక్డౌన్ నిబంధనలు ఓ గర్భిణీ ప్రాణాన్ని నిలువునా తీశాయి. డెలివరీ కోసం  ప్రభుత్వాస్పత్రికి వెల్తున్న అంబులెన్స్ ను రెడ్ జోన్ లోకి ఎంటరవుతుందంటూ పోలీసులు ఆపి విచారణ చేపట్టారు. అయితే అప్పటికే అంబులెన్స్ లోనే డెలివరీ అయిన గర్భణీ పరిస్థితి విషమంగా మారింది. గర్భిణీ బంధువులు ఎంత చెప్పినా పోలీసులు బారికేడ్లు తీయలేదు. రక్తస్రావం అధికమై గర్భిణీ చనిపోయింది. విషయం తెలిసిన స్థానికులు వందలసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కర్నూల్ ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్,నగర డిఎస్పీ బాబా ఫకృద్దిన్ సర్థిచెప్పడంతో స్థానికులు శాంతించారు. ఆసుపత్రికి వెళ్లే దారిని వెంటనే ఓపెన్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.