మాస్క్ లేని మందుబాబులకు పోలీసుల షాక్ ట్రీట్మెంట్..
ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాస్కులు లేకుండా కనిపిస్తే కఠినచర్యలు తీసుకుంటున్నారు. అలా మాస్కులు లేకుండా మద్యం కొనడానికి వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి, క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అనంతపురం మాత్రమే కాదు గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని పట్టణాల్లో ఇదే మార్క్ పనిష్మెంట్ను అమలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జరిమానాలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు.